PhonePe: రూ.50కి మించిన మొబైల్ రీఛార్జీలపై ఫోన్పే ప్రాసెసింగ్ రుసుము
దిల్లీ: వాల్మార్ట్ గ్రూప్నకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే, ఫోన్ రీఛార్జులపై ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్ చెల్లింపుల సంస్థగా ఫోన్పే
నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్పే అధికార ప్రతినిధి వెల్లడించారు.
* థర్డ్ పార్టీ యాప్లలో అధిక లావాదేవీలను ఫోన్పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది
* థర్డ్ పార్టీ యాప్లలో అధిక లావాదేవీలను ఫోన్పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది
0 Response to "PhonePe: రూ.50కి మించిన మొబైల్ రీఛార్జీలపై ఫోన్పే ప్రాసెసింగ్ రుసుము"
Post a Comment