11 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు
నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయి భౌతిక విచారణలు
సాక్షి,అమరావతి: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. 20వ తేదీన హైకోర్టు పునః ప్రారంభం అవుతుంది. ఈ సెలవుల్లో దాఖలయ్యే అత్యవసర కేసులను న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ మంతోజు గంగారావు విచారించనున్నారు.
జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రఘునందన్రావు బెంచ్లో, జస్టిస్ గంగారావు సింగిల్గా కేసులను విచారిస్తారు. ఈ నెల 12న ఈ ముగ్గురు న్యాయమూర్తులు తమ ముందు దాఖలయ్యే కేసులను విచారిస్తారు. కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 11న దాఖలు చేయాల్సి ఉంటుంది
0 Response to "11 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు"
Post a Comment