హోంజాతీయంత్వరలో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: వచ్చే సోమవారం(27న)నాడు ప్రజారోగ్యానికి సంబంధించి నూతనంగా ‘ప్రధాన మంత్రి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ఆ పథకం కింద ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ ఐడీ కార్డు ఇస్తామన్నారు. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దగ్గరి నుంచి సదరు వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య, వైద్య సమాచారమంతా దానిలో ఎప్పటికప్పుడు నిక్షిప్తమవుతుందని చెప్పారు.


కాగా.. దేశ ప్రజలకు అత్యంత నాణ్యమైన వైద్యం.. ఆరోగ్య సంరక్షణ అందించడంలో తాము మాటకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌(ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన-పీఎం జేఏవై) పథకాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తైంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "హోంజాతీయంత్వరలో డిజిటల్‌ హెల్త్‌ కార్డులు"

Post a Comment