AP News: పాఠశాల కమిటీ ఎన్నికలు.. పలుచోట్ల ఉద్రిక్తత

అమరావతి: ఏపీలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం
తిరుమాలిలో వైకాపా- తెదేపా వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని వైకాపా శ్రేణులు.. జరిపించాలని తెదేపా కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెదేపా శ్రేణులకు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఓటు వేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను వైకాపా శ్రేణులు అడ్డగించేందుకు యత్నించారు. దీంతో అడ్డు తొలగాలంటూ గ్రామస్థులతో కలిసి తెదేపా నేతలు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల తోపులాటతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారి చెదరగొట్టారు

మరోవైపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలోనూ ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు గ్రామంలో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులో స్వల్ప ఘర్షణ జరిగింది. వైకాపాలో రెండు వర్గాల మధ్య ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు పోటీ ఏర్పడింది. పోలీసుల జోక్యంతో అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది

అనంతపురం: జిల్లాలో పలుచోట్ల పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దయ్యాలకుంటపల్లిలో కమిటీ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నికయ్యారు. టీడీపీ నేత ఎంపికైన పత్రాన్ని వైసీపీ సర్పంచ్‌ చించేశారు. శింగనమల మండలం జాలాలపురంలో పాఠశాల కమిటీ ఎన్నిక వాయిదా పడింది. జాలాలపురంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో ఎన్నిక వాయిదా పడింది. కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి పాఠశాల కమిటీ ఎన్నికలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటు విషయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "AP News: పాఠశాల కమిటీ ఎన్నికలు.. పలుచోట్ల ఉద్రిక్తత"

Post a Comment