Maternity Leaves: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రసూతి సెలవులను పెంచిన ప్రభుత్వం.. ఎన్ని నెలలంటే.

మహళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవుల కాలపరిమితిని తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వం పెంచింది. ఈ సంవత్సరం వరకు వాళ్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు. ఈ నిబంధన 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటి కావడం గమనార్హం. దానిని తమ ప్రభుత్వం అమలు చేసిందని బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. 

ఈ నిబంధన జూలై 1, 2021 నుంచి అమలులోకి తీసుకోబడుతుందని తెలిపారు. రెండు లేదా అంత కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. తమిళనాడులో తాజా పాలసీ మొదటగా తల్లిపాలు తాగే నవజాత శిశువుల సంఖ్యను పెంచాలనే రాష్ట్ర లక్ష్యానికి సహాయపడుతుందని భావిస్తున్నారు

తమిళనాడు ఆర్థిక మంత్రి 2021-22 సంవత్సరానికి మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళలకు ప్రసూతి సెలవు పొడిగింపుతో సహా అనేక ప్రకటనలు కూడా చేశారు.

పెట్రోల్ ధరలను రూ .3 తగ్గించనున్నట్లు కూడా త్యాగరాజన్ చెప్పారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పూర్తిగా తగ్గించే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఈ ధరల పెరుగుదల కారణంగా సామాన్యుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అంతేకాకుండా సర్వీస్‌లో ఉన్నప్పుడు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి కుటుంబ సెక్యూరిటీ ఫండ్ నుంచి ఇచ్చే లంప్సమ్ గ్రాంట్‌ను రూ .5 లక్షలకు పెంచారు. గతంలో ఈ గ్రాంట్ రూ. 3 లక్షలుగా ఉండేది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల ఏప్రిల్ 1, 2022 నుండి వర్తిస్తుందని బడ్జెట్ లో ప్రకటించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Maternity Leaves: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రసూతి సెలవులను పెంచిన ప్రభుత్వం.. ఎన్ని నెలలంటే."

Post a Comment