ఒకే పాఠశాలలో 10మంది విద్యార్థులకు కరోనా

ముదినేపల్లి: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

 శుక్రవారం పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఒకే పాఠశాలలో 10మంది విద్యార్థులకు కరోనా"

Post a Comment