ఫొటో ఓటర్ల జాబితా సవరణ ఈసీ అవకాశం
అమరావతి:
ఏపీలో ఫొటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేక
ప్రకటన విడుదల చేసింది.
పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు
నిర్ధిష్టమైన గడువును ఖరారుచేసింది. 2021 జనవరి 1 నాటికి సవరించిన ఫొటో
ఓటర్ల జాబితా ప్రకటనకు షెడ్యూల్ను ప్రకటించింది. ఓటర్ల జాబితాలో
అభ్యంతరాలపై దరఖాస్తుకు అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. సవరించిన
ఓటర్ల జాబితాతో
ముసాయిదాను నవంబర్ 16న ప్రకటించనున్నట్టు స్పష్టంచేసింది.
అభ్యంతరాలు, ఫిర్యాదులకు డిసెంబర్ 15 వరకు సమయం ఇచ్చింది. 2021 జనవరి 15న
ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు ఈసీ తెలిపింది
0 Response to "ఫొటో ఓటర్ల జాబితా సవరణ ఈసీ అవకాశం"
Post a Comment