వారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు

విజయవాడ: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపడంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారు. 



అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు ప్రాథమికంగా ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.


 అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని, రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్  స్టార్ట్ చేయాలని నిర్ణయానికొచ్చామని ఏపీ ఎస్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. తొలుత 256 సర్వీసులు ఏపీ నుంచి తెలంగాణకు నడపాలని నిర్ణయించామని, 

వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు. కిలోమీటర్ ప్రాతిపదికగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని, కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామని, విభజన జరిగినపుడు ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అమలు కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని,


 అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం బస్సులు నడపాలని ఇరురాష్ట్రాల ఆర్టీసీలు నిర్ణయించాయని ఏపీ ఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు"

Post a Comment