జేఈఈ, నీట్ పరీక్షల తేదీలు ఖరారు
దిల్లీ: ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.
జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్), జులై 26న నీట్, ఆగస్టులో జేఈఈ అడ్బాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు.
ఇక వాయిదా పడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
0 Response to "జేఈఈ, నీట్ పరీక్షల తేదీలు ఖరారు"
Post a Comment