ఉపాధ్యాయుల బదిలీలపై కసరత్తు

 విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు ప్రారంభమైంది. పాఠశాలల పునః ప్రారంభం నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్న విద్యాశాఖ అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. 



ఈ మేరకు జిల్లా విద్యాశాఖను జిల్లాలోని ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు కోరింది.
వీటిలో దీర్ఘ కాలిక ఖాళీలు,యగ్జిస్ట్,పదోన్నతి ఖాళీల వివరాలు ఉన్నవి

టీచర్ల బది లీలు ప్రారంభం కావాలంటే తొలుత  రేషనలైజేషన్‌ (విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.


 ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు ఎనిమిదేళ్లుగా ఒకేప్రాంతంలో పనిచేసే వారిని, ఐదే ళ్లుగా  ఒకే చోట పనిచేసే  ప్రధానో పాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. 



 29 ఫిబ్రవరి 2020 తేదీని ప్రామాణికంగా ఖాళీలు నిర్ణయించారు


 దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు    గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలను సమర్పించారు. .. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 

వీటన్నిటిని పరిశీలించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోనుంది. మూడేళ్ళ నుంచి బదిలీల షెడ్యూల్ కోసం వేలాది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు.దీనిపై అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కోవిడ్ దృష్ట్య ఆన్ లైన్ బదిలీలే మేలయ్యేలా ఉంది. ఈ సంవత్సరం తప్పితే 2023 వరకు బదిలీల కోసం ఎదురు చూడాల్సిందే. ఆరు సంవత్సరాలు నిరీక్షణ ఎలా అని సామాన్య ఉపాధ్యాయులు చర్చించు కొను చున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయుల బదిలీలపై కసరత్తు"

Post a Comment