తెలుగు రాష్ట్రాల్లోని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో కేంద్రం మార్పులు
న్యూఢిల్లీ: కరోనా ప్రభావం, జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ లేఖ రాశారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. దేశ వ్యాప్తంగా రెడ్జోన్లో 130 జిల్లాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆరెంజ్ జోన్లో 284, గ్రీన్జోన్లో 319 జిల్లాలు ఉన్నట్లు తెలిపింది. రెడ్జోన్లో అత్యధికంగా యూపీలోని 19 జిల్లాలు, మహారాష్ట్రలోని 14 జిల్లాలు, తమిళనాడులో 12, ఢిల్లీ 11, బెంగాల్లో 10 జిల్లాలను కేంద్రం చేర్చింది. రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేశామని ప్రీతి సూడాన్ స్పష్టం చేశారు.
తెలుగు
రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న జిల్లాల్లో కేంద్రం
కొన్ని మార్పులు చేయడం గమనార్హం. కేంద్రం చేసిన తాజా మార్పులతో ఏపీలోని 13
జిల్లాల్లో 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 7 జిల్లాలు ఆరెంజ్
జోన్లో చేర్చారు. తెలంగాణలో రెడ్జోన్లో 6 జిల్లాలు, ఆరెంజ్ జోన్లో 18
జిల్లాలు, గ్రీన్జోన్లో 9 జిల్లాలను చేర్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ
ప్రకటించింది.
ఏపీ రెడ్ జోన్ జిల్లాలు:
కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
ఆరెంజ్ జోన్ జిల్లాలు:
తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ జిల్లాలు
గ్రీన్జోన్ జిల్లాగా విజయనగరం
తెలంగాణ రెడ్ జోన్ జిల్లాలు:
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలు
ఆరెంజ్ జోన్ జిల్లాలు:
నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల
గ్రీన్ జోన్ జిల్లాలు:
పెద్దపల్లి, నాగర్కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి
0 Response to "తెలుగు రాష్ట్రాల్లోని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల్లో కేంద్రం మార్పులు"
Post a Comment