వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ
వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ
అన్ని రకాల పొదుపు ఖాతాల వడ్డీరేటుపై 0.25శాతం మేర కోత విధిస్తున్నామని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ప్రకటించింది.
ఇకపై అన్ని డిపాజిట్లపై 2.75 శాతం మాత్రమే వడ్డీ చెల్లించనుంది. కొత్త వడ్డీ రేట్లు 2020, ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇంతకు ముందు వరకు ఈ వడ్డీరేటు 3 శాతంగా ఉండేది
అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటుపై 35 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. 7.75 శాతంగా ఉన్న వడ్డీరేటు 2020, ఏప్రిల్ 10 నుంచి 7.40శాతంగా ఉండనుంది.
2019-20లో వరుసగా 11వ సారి ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధిస్తున్నామని బ్యాంకు ప్రకటించింది.
30 ఏళ్ల కాల పరిమితి గృహ రుణాల ఈఎంఐలు (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) లక్షకు రూ.24 రూపాయాలు తగ్గుతాయని వెల్లడించింది
♦ సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతమున్న 3 శాతం నుంచి
2.75 శాతానికి తగ్గించింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకూ ఇది
వర్తిస్తుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉండడం దీనికి కారణం.
♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది.
♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది.
♦ ఎంసీఎల్ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.
♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది.
♦ దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది
♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది.
♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది.
♦ ఎంసీఎల్ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.
♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది.
♦ దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది
0 Response to "వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ"
Post a Comment