నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు

 నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు*

★ లాక్‌డౌన్‌ కారణంగా బ్యాంకులు ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తుండగా గురువారం నుంచి పాత పని వేళలు అమలు కానున్నాయి.

★ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి.

★ పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి మోదీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు ఏప్రిల్‌ 2న జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకానుంది. 

★ కేవలం మహిళల ఖాతాల్లో మాత్రమే నగదు జమ కానుంది. 3 నెలలకు సంబంధించి మొత్తాన్ని ఒకే పర్యాయం జమ చేస్తారా? లేక ఒక నెలకు సంబంధించి రూ.500 మాత్రమే వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. 

★ ఈ లబ్ధిదారులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతర ఖాతాదారులు బ్యాంకులకు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ ఉంటుందని అంచనా. 



★ రద్దీ నిర్వహణ కోసం ఆర్టీసీ కండక్లర్లు, మహిళా సంఘాల ప్రతినిధులను బ్యాంకులు వాలంటీర్లుగా వినియోగించుకోనున్నాయి. 

★ బ్యాంకు బిజినెస్‌ కరస్పాండెంట్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నారు. వీరికి రోజుకు నగదు నిర్వహణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నేటి నుంచి యథావిధిగా బ్యాంకు పనివేళలు"

Post a Comment