కరోనా కౌంట్ - తెలంగాణాలో 272, ఎపిలో 252

హైదరాబాద్/అమరావతి - కరోనా వైరస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. కరోనా బాధితుల్లో జమాత్ సదస్సుకి వెళ్లిన వారే ఎక్కువమంది ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కొత్త కేసులన్నీ కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 53కి పెరిగింది. దీంతో కర్నూలు జిల్లా వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 34 కేసులతో నెల్లూరు, 30 కేసులతో గుంటూరు జిల్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు.దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252 కి చేరింది




ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 272కి పెరిగింది. వివిధ ఆస్పత్రుల్లో 228 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 33 మంది బాధితులు కోలుకుని డిశ్చార్‌ కాగా, కరోనాతో రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. జిల్లాల వారిగా చికిత్స పొందుతున్న బాధితులను చూసుకుంటే ఈ విధంగా ఉన్నారు.

మహబూబాబాద్‌ - 1
జయశంకర్‌ భూపాలపల్లి- 1
సిద్దిపేట- 1
సూర్యపేట-1
హైదరాబాద్‌ - 93
వరంగల్‌ అర్భన్‌ జిల్లా - 21
నిజామాబాద్‌ - 18
నల్లగొండ-13
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి - 12
రంగారెడ్డి -10
కామారెడ్డి -8
ఆదిలాబాద్‌ -9
సంగారెడ్డి -7
జోగులాంబ గద్వాల-5
మెదక్‌-4
భద్రాద్రి కొత్తగూడెం -3
జగిత్యాల -2
జనగామ -2
నాగర్‌కర్నూల్‌-2
వరంగల్‌ రూరల్‌-2
వికారాబాద్‌ -2

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా కౌంట్ - తెలంగాణాలో 272, ఎపిలో 252"

Post a Comment