10 తరగతి కి దూరదర్శని సప్తగిరి పాఠాలు

కరోనా కారణముగా రాష్ట్రములో అన్ని పాఠశాలలు మూత పడిన కారణంగా
 10వ తరగతి విద్యార్ధులకు దూర దర్శన్‌ సప్తగిరి, విద్యా  శాఖ సంక్షేమ పాఠశాలల సంయుక్త వారి ఆధ్వర్యములో తేదీ 08-04-2020 నుండి రెండు సెషన్స్‌ లో తరగతులు నిర్వహించుచున్నారు.


 ఈ తరగతులు ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు మరియు సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు నిర్వహించబడును.



కావున యజమాన్యముల 10వ తరగతి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోవలసినదిగా కార్యదర్శి, డాక్టర్‌  ప్రసన్నకుమార్‌, ఆంధ్ర ప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ, కార్యదర్శి, కేజీబివీ మరియు ఆదర్శ పాఠశాలలు, అమరావతి వారు ఒక ప్రకటనలో తెలియచేసినారు.




విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, సంబంధిత ప్రధానాచార్యులు మరియు ప్రత్యేక అధికారులు ఈ విషయాన్నీ విద్యార్థులకు తెలియచేయవలసినదిగా కోరడమైనది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10 తరగతి కి దూరదర్శని సప్తగిరి పాఠాలు"

Post a Comment