టెంత్ పరీక్షలు వాయిదా
జ ౫ ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఖరారు
కావడంతో ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పదవ తరగతి పరీక్షలు
వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం
ఎన్నికల సంఘానికి అవసరమైన సమాచారాన్ని అందజేశారు. ఈ విషయాన్ని
ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ఎన్.రమేష్ కుమూర్ కూడా ధృవీకరించారు.
వచ్చే నెల(ఏప్రిల్) 4ీవ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని
ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఎంపీటీసీ,
జెద్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత ఏ/ నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు
షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఇదే సమయంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు
ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పరీక్షలను వాయిదా
వేయాలని నిర్ణయించింది. కొత్త షెడ్యూల్ను రెండు, మూడు రోజుల్లో అధికారి
కంగా ప్రకటించనున్నారు. వరుస ఎన్నికల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు
కూడా పరీక్షల వాయిదాను స్వాగతిస్తున్నారు
0 Response to "టెంత్ పరీక్షలు వాయిదా"
Post a Comment