ఎన్నికల నిలిపివేతపై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖపై రమేశ్‌కుమార్‌ స్పందిస్తూ లేఖ రాశారు. ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో సవివరంగా వెల్లడిస్తూ మూడు పేజీల లేఖను సీఎస్‌కు పంపారు.



''గతంలో రాజ్‌భవన్‌లో ఫైనాన్స్‌ వ్యవహారాలు చూశాను. రాజ్‌భవన్‌ కంటే ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎన్నికలు నిలిపివేసినా కేంద్ర నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారు

CLICK HERE TO DOWNLOAD LR

గోవాలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసే విషయాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో అవగాహన ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుంది. నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపా. వారి సూచనలు, హామీతో ఎన్నికలు వాయిదా వేశా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నా. ఇతర రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అందరికంటే మందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు. కరోనా వైరస్‌ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడితే 6 వారాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం'' అని రమేశ్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడిపెట్టవద్దని సూచించారు. అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే సీఎస్‌కు లేఖ రాసినట్లు రమేశ్‌కుమార్‌ వెల్లడించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎన్నికల నిలిపివేతపై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ"

Post a Comment