పిల్లల చదువుకు.. పాలసీలున్నాయా?
నేను తక్కువ నష్టభయం ఉండే బాండు ఫండ్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఇప్పుడు ఈటీఎఫ్లు వచ్చాయి కదా.. వీటిలో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? నష్టం వచ్చే ఆస్కారం ఉంటుందా?
- పూర్ణచంద్ర
ప్రస్తుతం భారత్ బాండ్ ఈటీఫ్ పేరుతో ఒక ఫండ్ ప్రారంభం అయ్యింది.
ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలో మదుపు చేస్తుంది. ఇది రెండు వ్యవధుల్లో లభిస్తోంది. మూడేళ్ల బాండ్ ఫండ్ 6.3 శాతం రాబడిని ఇస్తోంది. పదేళ్ల బాండ్ ఫండ్ 7శాతం రాబడిని అందిస్తోంది. ఈ ఫండ్ మదుపు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలకు ఏదైనా సమస్య ఎదురైతే.. పెట్టుబడి పెట్టిన వారికీ కాస్త నష్టభయం ఉంటుంది. ఇందులో రుసుములు చాలా తక్కువ. మధ్యలో తీసుకోవాలనుకుంటే.. అమ్మకపు రుసుము 0.1శాతం విధిస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా డెట్ మ్యూచువల్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. మీరు 30శాతం పన్ను శ్లాబులో లేకపోతే.. పోస్టాఫీసులో కిసాన్ వికాస పత్రాలు లేదా జాతీయ పొదుపు పథకాలను పరిశీలించవచ్చు. ఇవి పూర్తిగా సురక్షితం
* మాకు ఒక అమ్మాయి. తన వయసు 12 ఏళ్లు. ఆమె ఉన్నత చదువులకు ఉపయోగపడేలా నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. మంచి రాబడి వచ్చే పథకాలేమున్నాయి? చదువు కోసం ప్రత్యేకంగా ఏదైనా
బీమా పాలసీ అందుబాటులో ఉందా?
- శ్రావణి
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్తు అవసరాలకు రక్షణ కల్పించేందుకు, కుటుంబంలో ఆర్జించే వ్యక్తి పేరుమీద తగిన మొత్తానికి జీవిత బీమా తీసుకోండి. ప్రత్యేకంగా పిల్లల చదువు కోసం బీమా పాలసీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ, మీకు వ్యవధి చాలా తక్కువగా ఉంది. కాబట్టి, ఇందులో అన్నీ మీకు నప్పకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీనికోసం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్లను పరిశీలించవచ్చు
నా వయసు 29 ఏళ్లు. టర్మ్ పాలసీతోపాటు, పదవీ విరమణ ప్రణాళిక కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నెలకు రూ.4వేల వరకూ వీటికోసం కేటాయించగలను. నా ప్రణాళిక ఎలా ఉంటే
బాగుంటుంది?
- విష్ణు
ముందుగా మీరు రూ.40 లక్షల విలువైన టర్మ్ పాలసీ తీసుకోండి. దీంతోపాటు వ్యక్తిగత ప్రమాద బీమా, డిజేబిలిటీ ఇన్సూరెన్స్నూ ఎంచుకోండి. మీరు పదవీ విరమణ కోసం మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.2,000లు ప్రజా భవిష్య నిధిలో జమ చేయండి. మిగతా రూ.2,000 డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. భవిష్యత్తులో మీ ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడి మొత్తాన్నీ పెంచే ప్రయత్నం చేయండి. పదవీ విరమణకు ఇంకా 31 ఏళ్ల సమయం ఉంది కాబట్టి, మంచి మొత్తం జమ అయ్యే అవకాశముంది
నా వయసు 40 ఏళ్లు. గత రెండేళ్లుగా నెలకు రూ.8,500 వరకూ ఈపీఎఫ్లో జమ చేస్తున్నాను. ఇందులోనే మరో రూ.4,000 వరకూ పెంచాలని అనుకున్నాను. దీనికి బదులుగా ఒక యూనిట్ ఆధారిత బీమా పాలసీ తీసుకోవాలని స్నేహితుడు సూచించారు. ఇలా చేయడం మంచిదేనా? కనీసం 10శాతం రాబడి ఎలా సాధించాలి?
- శ్రీనివాస్
వీపీఎఫ్లో ప్రస్తుతం 8.65శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీకి ఎలాంటి పన్ను ఉండదు. యూనిట్ ఆధారిత పాలసీ (యులిప్) తీసుకుంటే.. దాదాపు 4-7శాతం వరకూ ఛార్జీలు ఉంటాయి. ఈ ఛార్జీల వల్ల మీకు వచ్చే రాబడి తగ్గుతుంది. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ యులిప్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఛార్జీలు కాస్త తక్కువగా ఉంటాయి. మీరు యులిప్ తీసుకోవాలనుకుంటే.. వీటిని పరిశీలించండి. ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేయండి
0 Response to "పిల్లల చదువుకు.. పాలసీలున్నాయా?"
Post a Comment