ఆరోగ్యశ్రీలోకి మరిన్ని కేన్సర్ చికిత్సలు
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ
ద్వారా మరిన్ని కేన్సర్ శస్త్ర చికిత్సలు చేసేందుకు ప్రభుత్వం
సిద్ధమైంది. మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఆంకాలజీలో కొత్త శస్త్ర
చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు శస్త్ర
చికిత్సలకు ప్యాకేజీని కూడా 5 శాతం పెంచింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య
కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విధివిధానాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న శస్త్ర
చికిత్సల్లో 8 చికిత్సలను తొలగించారు. మరోవైపు కేన్సర్ శస్త్ర చికిత్సల
గురించి సోమవారం విజయవాడలోని హోటల్ మురళీఫార్చ్యూన్లో ఆరోగ్యశ్రీ
అధికారుల సమావేశం నిర్వహించారు. కేన్సర్ నివారణ ప్రక్రియలు, కార్యక్రమాల
అమలుపై విస్తృతంగా చర్చించారు
0 Response to " ఆరోగ్యశ్రీలోకి మరిన్ని కేన్సర్ చికిత్సలు"
Post a Comment