కేంద్ర బడ్జెట్‌ పై సర్వత్రా ఆసక్తి...ఆదాయపు పన్ను తగ్గిస్తారా..?

నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ వైపు ఆర్థిక మందగమనం మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోతను గణనీయంగా తగ్గించిన కేంద్రం ఇప్పుడు బడ్జెట్లో పన్ను ప్రోత్సహకాలు ప్రకటించస్తారా లేదా అన్న అంశం పై ఆసక్తి నెలకొంది. నిర్మలా సీతారామన్‌ మొదటి బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కించే చర్యలేవీ లేవని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే గత సెప్టెంబరులో ఆ విమర్శలను తిప్పికొడుతూ కార్పొరేట్‌ పన్నును తగ్గించింది కేంద్రం. అయితే ఆ 



నిర్ణయంతో ఖజానాపై ఒక లక్ష 45 కోట్ల ప్రభావం పడనుంది. మరోవైపు 2019లో వస్తు, సేవల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. స్థిరాస్తి, విద్యుత్‌ వాహనాలు, హాస్టల్‌ వసతి, వజ్రాల తయారీ, అవుట్‌డోర్‌ కేటరింగ్‌ల పై వస్తు, సేవల పన్నులను 
జీఎస్‌టీ, కార్పొరేట్‌ పన్నును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు వినియోగం కూడా నెమ్మదించడంతో పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో ఆదాయ లక్ష్యాలను సాధించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. అయితే ఈ విషయాలపై పెద్దగా ఆలోచన చేయని సామాన్య ప్రజలు మోదీ 2.0 ప్రభుత్వం తమకు కూడా పన్నుల వరాలు ప్రకటిస్తుందనే ఆశతో ఉన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేంద్ర బడ్జెట్‌ పై సర్వత్రా ఆసక్తి...ఆదాయపు పన్ను తగ్గిస్తారా..?"

Post a Comment