రాష్ట్రమంతా 6 ప్రాంతాలు 8 పరిపాలనా విభాగాలు

ఏపీ సమగ్రాభి వృద్ధి పై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీజీసీ) కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందజేసిన నేపథ్యంలో ఆ వివ రాలను ప్రభుత్వం వెల్లడించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం కార్యదర్శి జీవీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌ కుమార్‌ ఈ వివరాలను వెల్ల డించారు. బీసీజీ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలు.. 8 విభాగాలుగా విభజించి అధ్యయనం చేసిందని తెలిపారు. రాష్ట్రమంతటా అభివృద్ధి సాధించా లంటే ఇది ఉత్తమమైన మార్గమని పేర్కొంది. ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టాలో కృష్ణా, గుంటూరు జిల్లాలు, దక్షిణాంధ్రలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఈస్ట్‌ రాయల సీమలో చిత్తూరు, కడప జిల్లాలు వెస్ట్‌ రాయలసీమలో కర్నూలు, అనంతపురంజిల్లాలుగా విభజించినట్లు 




ఆయా ప్రాంతాల్లో వనరులు, అభివృద్ధికి ఆటంకాలు, పరిష్కారాలను కమిటీ పరిశీలించిందని విజయ్‌ కుమార్‌ వివరించారు. విశాఖలో తప్ప మిగతా చోట్ల అంతర్జాతీయ ప్రయాణీ కులు లేరని, పోర్టులు కూడా అక్కడి కంటే ఎక్కడా అభివృద్ధి చెందలేదని చెప్పారు. విదేశీ పర్యాటకుల వల్ల ఆర్ధిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు.
ఉత్తరాంధ్రలో మెడికల్‌ హబ్‌: 
ఉత్తరాంధ్రను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేయొచ్చని కమిటీ తమ నివేదికలో పేర్కొంది. కాఫీ, పసుపు, జీడిప ప్పు పరిశ్రమలకు ఆ ప్రాంతం అనుకూలమని చెప్పింది. గోదావరి డెల్టాలో ప్లాస్టిక్‌, గ్యాస్‌ రంగాల్లో పరిశ్రమలు, బ్యాక్‌ వాటర్‌ టూరిజంతోపాటు పోలవరం, వాటర్‌ గ్రిడ్‌, రోడ్‌ గ్రిడ్‌ వంటివి అభివృద్ధి చేయవచ్చని తెలిపింది. కృష్ణా జిల్లాను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు మచిలీపట్నం, మైపాడు బీచ్‌లను అభివృద్ధి చేయాలని సూచించింది. చిత్తూరు జిల్లాలో టమాటా పంటకు కోల్డు స్టోరేజీలు, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలని కమిటీ వారి నివేదికలో పేర్కొంది. కర్నూలు, అనంతపురం ప్రాంతంలో ఆటోమొబైల్‌ లాజిస్టిక్‌ హబ్‌కు అవకాశముందని విజయ్‌ కుమార్‌ వివరించారు.
ప్రభుత్వం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయా ? 
పెట్టుబడులు - రాబడి అనే కోణంలో చూస్తే అమరావతి నిర్మాణంతో ఆర్ధిక భారం పెరుగుతుందని చెప్పారు. అమరావతి దార్శినిక పత్రంలో పేర్కొన్న లక్ష్యాలను చేరుకోవాలంటే రూ. 1.10 లక్షల కోట్లు అవసరమన్నారు. అంత డబ్బు ఒకే నగరంపై పెట్టడం అవసరమా అనే దానిపై ఆలోచించాలన్నారు. అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ఏటా రూ. 10 వేల కోట్లు వడ్డీ కట్టాలని పేర్కొన్నారు. అక్కడ భూములు అమ్మకం ద్వారా వచ్చే నిధులు సరిపోవని తెలిపారు. 40 ఏళ్ల తరువాత వచ్చే రాబడికోసం ఇప్పుడింత పెట్టుబడి అవసరం లేదన్నారు. అమరావతిపై పెట్టే రూ. లక్ష కోట్లను నీటి పారుదలపై పెడితే మంచి ఫలితాలొస్తాయ న్నారు. ఆ నిధులను అన్ని ప్రాంతాల్లోని సాగు, తాగు నీటిపై పెడితే ఉత్తమ ఫలితా లొస్తాయన్నారు. ఇతర రంగాలపై పెట్టుబడి పెడితే సత్వర అభివృద్ధి, సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. నీటి పారుదలపై పెడితే ప్రాంతీయ అసమానతలు తొలగుతాయని చెప్పారు. అసలు ప్రభుత్వం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయా అన్నది తెలుసు కోవాలని చెప్పారు. ఇప్పటికే రూ. 2.25 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రం అంత పెట్టుబడి పెట్టగలదా అనేదానిపై ఆలోచించాల్సిన అవ సరం ఉందన్నారు. అమరావతిపై పెట్టే డబ్బు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెడితే మంచిదని చెప్పారు. విశాఖ నగరం మంచి మౌలిక సదుపా యాలు కలిగి ఉందని, ప్రజలతో సంబంధంలేని శాఖలను ఒక గ్రూపుగా పరిగణించాలని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
నివేదికలోని మరికొన్ని అంశాలు: 
రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి కమిటీ పలు సూచనలు చేసింది. కృష్టా డెల్టా, ప్రస్తుత రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా పలు సూచనలు ఇచ్చింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా గడచిన 50 సంవత్సరాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలు, వాటి నుండి వస్తున్న ఫలితాలను, గణాంకాలతో కమిటీ విశ్లేషించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 2, 3 రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణలో ఉన్న రాష్ట్రానలు ప్రస్తావించింది. ప్రత్యేకించి మెగా సిటీలకోసం ఖర్చు చేయాల్సిన వ్యయ భారాన్ని కూడా సూచించింది. మస్టర్‌ లో ప్రతి 10 వేల మంది ప్రజల నివాసం ఉండటానికి 4.2 బిలి యన్‌ డాలర్లు ఖర్చు చేశారని, మలేషియాలో ఫారెస్టు సిటీలో ప్రతి 10 వేల మంది నివాసం ఉండటానికి 1.4 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారని, ప్రపంచ వ్యాప్తంగా 32 గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలను 50 ఏళ్లలో నిర్మిస్తే వాటిలో రెండు తప్ప మరే నగరాలు 50 శాతం లక్ష్యాలను కూడా చేరుకోలేక పోయాయని కమిటీ వివరించింది. మిగిలిన 30 నగరాలు కూడా విఫలమైనట్లు తెలిపింది. చైనాలోని ఫెన్షన్‌, ముంబై పక్కనే ఉన్న నవీ ముంబై మాత్రమే అనుకున్న విధంగా ముందుకు సాగాయని ఈ సందర్భంగా కమిటీ అక్కడి అభివృద్ధిని వివరించింది. ఫెన్షన్‌ పక్కనే హాంకాంగ్‌ ఉండటం వలన నవీ ముంబై పక్కనే ముంబై ఉండటం వల్ల అది సాధ్యమైందన్నారు. అక్కడ భూమి లేకపోవడం, విస్తరణకు మరో అవకాశం లేకపోవడంతో వీటిని ఈ నగరాలుగా అభివృద్ధి చెందాయన్నారు. దుబాయ్‌లో 40 ఏళ్లలో సీఏజీఆర్‌ కేవలం 7 శాతం కాగా, సింగపూర్‌లో 53 ఏళ్లలో 2 శాతం, హాంకాంగ్‌లో గడచిన 60 ఏళ్లలో 2 శాతం రాజధానులకోసం కొత్త నగరాలను నిర్మించినంత మాత్రాన ఆర్ధికంగా ఆ నగరాలు ముందు కు వెళ్లలేవనడం భావ్యం కాదన్నారు. బర్మాలో 2006 నాటికి సిద్ధమైనా ఇప్పటికీ 33 శాతం జనాభా లక్ష్యాన్ని దాటలేదన్నారు. మలేషియాలో పుత్రజయ 1999లో సిద్ధమైనా ఇప్పటికీ 20 శాతం లక్ష్యాలను దాటలేదని, అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 2045 నాటికి 1.2 లక్షల కోట్లు జీడీపీ ఉంటుందని అంచనాలు వేశారన్నారు. 2045 నాటికి 15 లక్షల నుండి 20 లక్షల మంది వరకూ వస్తారని చెపుతున్నారన్నారు. ఇలా సాధించాలంటే అమరావతి సీజీఆర్‌ 15 నుండి 16 శాతం ఉండాలన్నారు. కానీ దుబాయ్‌ లాంటి సిటీలో 7 శాతం, సింగపూర్‌లో 2 శాతం మేర నేటికీ దాటలేదన్నారు. గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్ర ఆదాయంలో 10 శాతం ఖర్చు చేసుకుంటూ పోతే 25 ఏళ్ల తరువాత ఎడాదికి 8 నుండి 12 వేల కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందన్నారు. ఆమరావతిలో మౌలిక వసతులు కల్పనకు 1.10 లక్షల కోట్లు కావాలని సీఆర్డీయే సూచిస్తుందని ఎకరా కనీసం రూ. 20 కోట్లకు అమ్మితే తప్ప లక్షల కోట్లు రావన్నారు. అమరా వతి నిర్మాణంకోసం చేసే ఖర్చుమొత్తంపై వచ్చే 10 నుండి 15 ఏళ్లలో 8 నుండి 10 వేల కోట్లు మేర వడ్డీ రూపేణా చెల్లించాల్సి ఉంటుదన్నారు. పైగా ప్రతి ఏడాది 6 నుండి 8 వేల కోట్లు సాధా రణంగా కూడా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇంత డబ్బు అమరావతిపై పెట్టడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని చెప్పారు. ఇవే డబ్బులను ఇరిగే షన్‌ ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఆ రంగానికి ప్రాధాన్యత నిస్తే 5 ఏళ్లలో అభివృద్ధి ఫలాలు అందడంతోపాటు రిస్క్‌ కూడా చాలా తక్కువగానే ఉంటుందని కమిటీ పేర్కొన్నట్లు చెప్పారు. అమరావతిలో హైటెక్‌ అగ్రికల్చర్‌ పద్దతిలో బలోపేతానికి అవకాశాలున్నాయని, ఆ దిశగా పరిశీలించొచ్చని, అలాగే ఎడ్యుకేషన్‌ హబ్‌గా కూడా అమరావతిని అభివృద్ధి చేయవచ్చని సూచించిదన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రమంతా 6 ప్రాంతాలు 8 పరిపాలనా విభాగాలు"

Post a Comment