ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఏపీ ప్రభుత్వం వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ వచ్చింది. విజయవాడలోని సఖి వన్ స్టాప్ సెంటర్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మచిలీపట్నంలోని ప్రత్యేక దత్తత సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తుల్ని కోరుతోంది కృష్ణా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ. మొత్తం 8 ఖాళీలున్నాయి. స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తుల్ని కృష్ణా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థకు పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను https://krishna.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.



ఆంధ్ర ప్రదేశ్ జాబ్స్: నోటిఫికేషన్ వివరాలివే

మొత్తం ఖాళీలు- 8

సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ (వుమెన్)- 1

కేస్ వర్కర్ (వుమెన్)- 1

పారా లీగల్ పర్సనల్ / లాయర్- 1

కౌన్సిలర్ (వుమెన్)- 1

ఐటీ స్టాఫ్- 3

మల్టీపర్పస్ హెల్పర్- 1

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 5

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 20 సాయంత్రం 5 గంటలు

విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు 


వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు.

వేతనం- రూ.6,000 నుంచి రూ.20,000.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

ప్రాజెక్ట్ డైరెక్టర్,

జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ,

SNR అకాడమీ రోడ్,

కార్మెల్ మాత చర్చి దగ్గర,

నర్సరీ రోడ్డు ఎదురు వీధి,

కానూరు, విజయవాడ- 520007

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం"

Post a Comment