ఎపిలో మున్సిపాలిటీల గ్రేడ్లలో మార్పులు.. వార్డుల సంఖ్య పెంపు.
అమరావతి - ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపాలిటీల గ్రేడ్ లలో మార్పులు చేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తాడిపత్రి అవతరించనుండగా, గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదాను రాయచోటి అందుకోనుంది. బద్వేల్, ఆముదాలవలస, పుంగనూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలను సెకండ్ గ్రేడ్ కు పెంచారు. కాగా పలు మున్సిపాలీటీల్లో ఎన్నికయ్యే వార్డు సభ్యుల సంఖ్య ను కూడా పెంచుతూ ఉత్వర్వులు జారీ అయ్యాయి.
పిడుగరాళ్ల మున్సిపాలిటీలో ఈ సంఖ్య 33కు, రాయచోటి లో 34కు, బద్వేల్ లో 35కు పుంగనూరులో 31కు, ఆముదాల వలస లో 27కు, తాడిపత్రిలో 36కు, నందికొట్యూరు మున్సిపాలిటీలో 29కి పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
0 Response to "ఎపిలో మున్సిపాలిటీల గ్రేడ్లలో మార్పులు.. వార్డుల సంఖ్య పెంపు."
Post a Comment