'పోటీపడాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి
ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్
అమరావతి: ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమని భావించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యానికి కొరత లేదని.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలంటే
ఆంగ్లమాధ్యమం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి క్రమంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు వివిధ పాఠశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగుతున్నారని చెప్పారు. అన్ని విషయాలపై చర్చించిన తర్వాతే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని మంత్రి సురేశ్ తెలిపారు
0 Response to "'పోటీపడాలంటే ఆంగ్లమాధ్యమం తప్పనిసరి"
Post a Comment