'స్పందన' దరఖాస్తులకు సీఎంవోఅధిక ప్రాధాన్యం
తిరుపతి: స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి హరికృష్ణ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో కడప, చిత్తూరు జిల్లా అధికారులతో స్పందన కార్యక్రమంపై నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించటంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులను ముఖ్యమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు.
అందులో కొన్ని వినతులను ఎంపిక చేసి వాటి పరిష్కారంపై వివరాలు సేకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రెండు జిల్లాల పరిధిలోని రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు
0 Response to "'స్పందన' దరఖాస్తులకు సీఎంవోఅధిక ప్రాధాన్యం"
Post a Comment