మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి బ్రేక్... ట్రాయ్ తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: నవంబర్ 4 నుంచి 10 వరకు మొబైల్ ఫోన్ వినియోగదారులు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకీ (ఎంఎన్‌పీ) దరఖాస్తు చేసుకోవడం కుదరదని భారత టెలీకాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. నవంబర్ 11 నుంచి నూతన విధానం అమల్లోకి తీసుకు వస్తున్నందున వారం రోజుల పాటు ఎంఎన్‌పీ సేవలు నిలిపివేయనున్నట్టు పేర్కొంది. మొబైల్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు తమ ఆపరేటర్‌ను మార్చుకునేందుకు ఎంఎన్‌పీ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ఎంఎన్‌పీ విధానం ప్రకారం వినియోగదారులు పోర్టబిలిటీ ప్రక్రియ పూర్తయ్యేందుకు వారం రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. కాగా నూతన విధానంతో మరింత వేగంగా, సులభంగా ఎంఎన్‌పీ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావాలని ట్రాయ్ భావిస్తోంది


వినియోగదారులు సర్వీస్ ఏరియాలోనే నివసిస్తూ కొత్త ఆపరేటర్‌ సేవలు అందుకోవాలంటే ఇకపై రెండు రోజులు సరిపోతుంది. సర్వీస్ ఏరియాకు వెలుపల నివసిస్తున్న వారు మాత్రం ఐదు పనిదినాల వరకు వేచిచూడాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి బ్రేక్... ట్రాయ్ తాజా ఆదేశాలు"

Post a Comment