సర్జరీ తర్వాత నెలకు రూ.5వేలు: జగన్
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కోలుకునేంత వరకూ నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225 చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించారు. కిడ్నీ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న వారితో పాటు తలసేమియా, హీమోఫీలియా వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10వేల ఆర్థిక సాయం వర్తింప చేయాలని సీఎం స్పష్టం చేశారు. తీవ్ర పక్షవాతంతో కుర్చీకి పరిమితమైన వారితో పాటు రెండు కాళ్లు, చేతులు లేనివారు.. పనిచేయలేని స్థితిలో ఉన్నవారు, కండరాల క్షీణతతో పనిచేయలేని వారికి ఈ ఆర్థిక సాయాన్ని వర్తింప చేయాలని జగన్ ఆదేశించారు. వీరందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి పింఛను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.16 వేలకు పెంచుతూ జీవో జారీ చేయాలని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆస్పత్రికి వస్తే.. డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నుంచే కొంత మొత్తాన్ని ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు
0 Response to "సర్జరీ తర్వాత నెలకు రూ.5వేలు: జగన్"
Post a Comment