జగన్ మరో సంచలన నిర్ణయం..! రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను రద్దు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు 



వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రూ. 7959.12 కోట్లను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి రూ. 7959.12 కోట్లు చెల్లింపులకు సంబంధించి జీవో నెంబరు 38 జారీ చేసింది గత ప్రభుత్వం. ప్రస్తుతం ఆ జీవోను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రకటించడంతో గత సర్కార్ జారీ చేసిన జీవోను రద్దు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగన్ మరో సంచలన నిర్ణయం..! రుణమాఫీ ఉత్తర్వులు రద్దు"

Post a Comment