మొబైల్ యాప్తో ఇ-ఓటింగ్
దిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఇ-ఓటింగ్ కోసం మొబైల్ యాప్ రూపొందించే యత్నాల్లో ఉంది. నమోదిత కంపెనీల్లోని రిటైల్ మదుపర్ల నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇది ఉపయోగ పడుతుందని భావిస్తోంది. కంపెనీ యాజమాన్యాల ప్రతిపాదనలు, కార్పొరేట్ పాలనా వ్యవహారాలకు మదుపర్ల సమ్మతి కచ్చితంగా తెలిపేందుకు వీలుగా, ఓటింగ్లో వారి భాగస్వామ్యం మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈ యాప్ను రూపొందించబోతోంది.
నమోదిత ప్రాక్సీ సలహాదారుల సిఫారసులకు సంబంధించిన లింకులను కూడా రిటైల్ మదుపర్లకు అందించాలని సెబీ యోచిస్తోంది. దీంతో నమోదిత సంస్థల ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు మదుపర్లకు లభిస్తుంది
ఆయా సంస్థల్లో కార్పొరేట్ పాలనా వ్యవహారాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే సెబీ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ మదుపర్లకు విదేశాల్లో జారీ చేసిన సెక్యూరిటీలను ఇక్కడి తమ డీమ్యాట్ ఖాతాల్లో ఉంచుకొనే సదుపాయాన్ని కూడా త్వరలోనే కల్పిస్తామని సెబీ తెలిపింది
0 Response to "మొబైల్ యాప్తో ఇ-ఓటింగ్"
Post a Comment