కేన్సర్ వ్యాధిని గుర్తించటం ఇక చాలా తేలిక ...!



ఈ ప్రపంచంలో వేల మంది మరణాలకు కారణమైన వ్యాధులలో కేన్సర్ ఒకటి. వేల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడుతున్నా వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోవటం వలన మరణాల సంఖ్య పెరుగుతోంది. కేన్సర్ వ్యాధి స్థాయిని త్వరగా గుర్తించటం వలన చికిత్స వేగంగా అందించే అవకాశం ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆచార్యులు కంప్యూటర్ ఉపయోగించి కణజాలాన్ని విశ్లేషించటం ద్వారా కేన్సర్ వ్యాధి స్థాయిని గుర్తించే టెక్నాలజీని అభివృధ్ధి చేశారు.



ట్రిపుల్ ఐటీ ఆచార్యులు చేసిన పరిశోధనలలో 90 శాతం ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయి. 1200 కణజాల నమూనాలపై 18 నెలల పాటు పరిశోధనలు జరిగాయి. వీరి పరిశోధనలు ఎక్కువగా కిడ్నీ కేన్సర్ పై జరిగాయి. వీరు కిడ్నీ కేన్సర్ బయాప్సీలకు సంబంధించిన స్లైడ్ లను డిజిటలైజ్ చేశారు


ఒక ప్రత్యేకమైన టూల్ ను ఉపయోగించి టూల్ ద్వారా కణజాలం కేన్సర్ కణజాలమా ? కాదా? రోగి యొక్క జీవిత కాలం, వ్యాధి దశలను సులభంగా గుర్తించారు.

పాథాలజిస్టులు సాధారణంగా మైక్రోస్కోప్ ఉపయోగించి వ్యాధిని డిజిటల్ పద్ధతిలో గుర్తించే విధానంతో పోలిస్తే ప్రత్యేకమైన టూల్ ను వినియోగించటం ద్వారా వేగంగా వ్యాధి గుర్తింపు జరిగింది. ప్రస్తుతం వీరు పరిశోధనల్లో కిడ్నీ కేన్సర్ తో పాటు మిగతా కేన్సర్ కణజాలాలపై పరిశోధనలు చేస్తున్నారు. 33 రకాల కేన్సర్లను ఈ విధానం ద్వారా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రిపుల్ ఐటీ ఆచార్యులు చేసిన పరిశోధనల్లో బయాప్సీ తీసిన ప్రాంతంలో కేన్సర్ మొదలు కాకపోయినప్పటికీ వేరొక అవయవం దగ్గర వ్యాపించిన కేన్సర్ శరీరంలో ఎక్కడనుండి మొదలైందో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కేన్సర్ వ్యాధిని గుర్తించటం కొరకు జరిగిన ఈ పరిశోధనల్లో ట్రిపుల్ ఐటీ ఆచార్యులు వినోద్, డీన్ జవహర్, పరిశోధక విద్యార్థి సాయిరాం భాగస్వాములు అయ్యారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేన్సర్ వ్యాధిని గుర్తించటం ఇక చాలా తేలిక ...!"

Post a Comment