చెప్పులు వేసుకుని బైక్ నడిపే వారికి షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. కాగా చలానాల విధింపునకు సంబంధించి కొత్తకొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
చెప్పులులు వేసుకుని వాహనం నడిపినా చలానా విధిస్తారని తెలుస్తోంది. ఈ చట్టంలో ఈ అంశం కూడా ఉందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ నియమాన్ని అధికారులు అమలు చేయడం లేదు. ట్రాఫిక్ నియమాలను అనుసరించి చూస్తే, చెప్పులు లేదా శాండిల్స్ ధరించి ద్విచక్రవాహనాలను నడపడం నేరం కిందకు వస్తుంది.
దీనికి తగిన జరిమానా విధించాల్సివుంటుంది. ఈ నియమాన్ని వాహనదారుని భద్రత కోసమే చట్టంలో పొందుపరిచారని సమాచారం. చెప్పులు, లేదా స్లీపర్స్ వేసుకుని వాహనం నడిపే వారికి రూ. 1000 జరిమానా విధిస్తారు. మరోసారి కూడా ఇదేవిధంగా చెప్పులు వేసుకుని బైక్ నడిపితే 15 రోజుల పాటు జైలుశిక్ష విధిస్తారు
0 Response to "చెప్పులు వేసుకుని బైక్ నడిపే వారికి షాకింగ్ న్యూస్"
Post a Comment