నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లలో IIIT ప్రవేశాల పూర్తి సమాచారం


నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లలో IIIT ప్రవేశాల పూర్తి సమాచారం

కౌన్సెలింగ్ తేదీలు

ఆగస్టు 5, 6 తేదీలలో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్ లకు



ఆగస్టు 7, 8 తేదీల్లో శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లకు


ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో ఉదయం 5:30 గంటలకే ఇడుపులపాయలోని రాజీవ్ గేటు వద్దకు చేరుకొని, టోకెన్లు తీసుకోవాలి. అదే శ్రీకాకుళం, నూజివీడులకు ఎంపికైన వారు నూజివీడు ప్రాంగణానికి చేరాలి.

తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ఇవే

పదో తరగతి హాల్ టికెట్


మార్కుల జాబితా


బదిలీ ధ్రువపత్రం


4 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్


ఆధార్ కార్డు


రేషన్ ధ్రువపత్రం


మీ సేవ కేంద్రాల నుంచి తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. 


నాన్ లోకల్ కోటా కింద ఎంపికైన విద్యార్థి తాను ఉండే ప్రాంతానికి సంబంధించి పదేళ్లు అక్కడ నివాసం ఉన్నట్టు నివాస ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. పైన పేర్కొన్నవన్నీ మూడు సెట్లు సమర్పించాలి.


విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగులైతే వారి గుర్తింపుపత్రాలు, తాజా వేతన ధ్రువపత్రం, పాన్, రేషన్, ఆధార్ కార్డులను వెంట తీసుకురావాలి. ఈ ధ్రువ పత్రాలు నాలుగు సెట్ల చొప్పున తేవాల్సి ఉంటుంది.


విద్యార్థి, తల్లిదండ్రులకు సంబంధించిన ఆరు పాస్ పోర్టు సైజ్ ఫొటోలను సమర్పించాలి.


ఫీజు రీఇంబర్స్ మెంట్ కు అర్హులు కాని విద్యార్థులు రూ. 36 వేల మొత్తా నికి డీడీ తీసుకురావాలి.

ఫీజుల వివరాలు

ఇక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. లక్ష లోపు వార్షికాదాయం ఉంటే అన్ని వసతులూ పూర్తి ఉచితంగానే లభిస్తాయి. తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్ మెంట్ కింద ఫీజు మొత్తాన్నీ చెల్లిస్తుంది. మిగిలిన విద్యార్థులు పీయూసీ 1, పీయూసీ 2కు గాను ఏడాదికి రూ. 36 వేల చొప్పున, నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యకుగాను ఏటా రూ.40 వేల చొప్పున రూ. 2. 32 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగులు, అధికాదాయం ఉన్న పిల్లలకు ప్రాంగణంలోని బ్యాంకు వారు రుణ సదుపాయం కల్పిస్తారు. విద్యార్థి, వారి తండ్రి గుర్తింపు పత్రాలు, పాన్, రేషన్, ఆధార్, వేతన ధ్రువపత్రాలను సమర్పిస్తే రుణం అందిస్తారు. సదరు విద్యార్థికి ఉద్యోగం వచ్చిన తరువాత ఆ రుణం మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు గాను విద్యా ర్థులు తమ ధ్రువపత్రాలకు సంబంధించిన నాలుగు సెట్ల నకళ్ళు, ఆరు ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుంది.
పత్రాలు లేవని గాబరా వద్దు
ఎంపికైన విద్యార్థులకు ఏవైనా ధ్రువపత్రాలు లేనట్లైతే గాబరా పడాల్సిన పనిలేదు. పత్రాలు ప్రవేశాలు ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు ఇతర కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరిపోయారు. వారు ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు బదిలీ సర్టిఫికెట్ ఇవ్వడంలో కానీ, కొందరికి కుల ధ్రువీకరణపత్రాలు, ఇతరత్రా తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అయినా వారు నేరుగా ప్రవేశాలకు హాజరై అధికారులతో మాట్లాడి, రెండు రోజుల్లో సదరు 


CLICK HERE TO OFFICIAL WEBSITE

ధ్రువపత్రాలు అందిస్తామని 'అండర్ టేకింగ్ సర్టిఫికెట్ అందించి ప్రవేశాలు పొందవచ్చు. ఒకవేళ ఈ గడువులోగా వారు సదరు ధ్రువపత్రాలు అందించక పోతే వారికి కేటాయించిన సీటును రద్దుచేసి, తరువాత స్థానంలో ఉన్న వారికి కేటాయిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లలో IIIT ప్రవేశాల పూర్తి సమాచారం"

Post a Comment