మూత్రం రీసైక్లింగ్తో ఎరువులు, నీరు
న్యూఢిల్లీ, ఆగస్టు 16: మానవ మూత్రాన్ని రీసైకిల్ చేసి హరిత ఎరువులు ఉత్పత్తి చేయడంతో పాటు నీటిని వేరుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు.
ఈ ఆవిష్కరణకు ‘వాటర్ చక్ర’ అని పేరు పెట్టారు. మానవుని మూత్రంలో 98 శాతం నీరు, 2 శాతం మేర నెట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి. అయితే మూత్రంలోని 96 శాతం ఫాస్పరస్, 85 శాతం నైట్రోజన్లను అమ్మోనియాగా మార్చడం
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని ఐఐటీఎం శాస్త్రవేత్త అనుషా గుప్తా తెలిపారు. మూత్రంలోని 90 శాతం నీటిని వేరు చేయగలగడం దీని మరో ప్రత్యేకతని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 22 శాతం ఫాస్పరస్ ఎరువుల అవసరాలు తీర్చే సామర్థ్యం వాటర్ చక్ర ప్రాజెక్టుకు ఉందన్నారు
0 Response to "మూత్రం రీసైక్లింగ్తో ఎరువులు, నీరు"
Post a Comment