మూత్రం రీసైక్లింగ్‌తో ఎరువులు, నీరు

న్యూఢిల్లీ, ఆగస్టు 16: మానవ మూత్రాన్ని రీసైకిల్‌ చేసి హరిత ఎరువులు ఉత్పత్తి చేయడంతో పాటు నీటిని వేరుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు.



 ఈ ఆవిష్కరణకు ‘వాటర్‌ చక్ర’ అని పేరు పెట్టారు. మానవుని మూత్రంలో 98 శాతం నీరు, 2 శాతం మేర నెట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాషియం ఉంటాయి. అయితే మూత్రంలోని 96 శాతం ఫాస్పరస్‌, 85 శాతం నైట్రోజన్లను అమ్మోనియాగా మార్చడం



 ఈ ప్రాజెక్టు ప్రత్యేకత అని ఐఐటీఎం శాస్త్రవేత్త అనుషా గుప్తా తెలిపారు. మూత్రంలోని 90 శాతం నీటిని వేరు చేయగలగడం దీని మరో ప్రత్యేకతని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 22 శాతం ఫాస్పరస్‌ ఎరువుల అవసరాలు తీర్చే సామర్థ్యం వాటర్‌ చక్ర ప్రాజెక్టుకు ఉందన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మూత్రం రీసైక్లింగ్‌తో ఎరువులు, నీరు"

Post a Comment