సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్‌

  • ఇప్పటివరకు జమ అయిన నిధులు రూ. 5,144 కోట్లు
  • సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) పరిధిలో మొత్తం 1,49,764 మంది ఉద్యోగులున్నట్లు తేలిందని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలిపింది. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా పొందినట్లు పేర్కొంది. ఈ పెన్షన్‌ స్కీం కింద ఉద్యోగులు రూ. 2,572.18 కోట్లను కాంట్రిబ్యూట్‌ చేయగా ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలిపింది. దీంతో ఈ స్కీం కింద రూ. 5,144.36 కోట్లు జమయ్యాయి. ఈ నిధులను వివిధ సంస్థల్లో పెట్టుబడులుగా వాడటం వల్ల వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ


6,965.90 కోట్లకు చేరింది. అయితే సీపీఎస్‌ డబ్బులను బ్యాంకుల్లో పెట్టుబడులుగా పెట్టడం వల్ల తక్కువ వడ్డీ వస్తోందని, ఈ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కీం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పీఎ్‌ఫఆర్‌డీఏ సంస్థ ఉద్యోగులకు చెల్లించే జీతాలను కూడా స్కీం నుంచే ఇస్తున్నట్లు 




అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై కూడా ఆర్టీఐ కింద సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. సంక్లిష్టమైన ఈ సీపీఎ్‌సను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్‌"

Post a Comment