రైతులకు పింఛను పథకం

కేంద్రం ఆధ్వర్యంలో పీఎంకేఎం యోజన

రైతుసేవా కేంద్రం ద్వారా నమోదు చేసుకోవచ్చు

ఏలూరు, న్యూస్‌టుడే

ఆరుగాలం కష్టించి ఆహార ధాన్యాలను పండించిన రైతులకు మలి వయసులో ఆర్థిక ఆసరాను ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (పీఎంకేఎంవై)ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9 నుంచి ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో 18 ఏళ్లు నిండిన యువ కర్షకులు మొదలు 40 ఏళ్ల వయసున్న రైతుల వరకు ప్రీమియం చెల్లించి సభ్యులుగా నమోదు కావచ్ఛు గరిష్ఠంగా రూ. 3000 పింఛను పొందే అవకాశం ఉంది. అంతేకాదు రైతు అకాల మరణం చెందితే జీవిత భాగస్వామికి పథకం వర్తిస్తుంది





ఆ తరువాత ఆమెకు పింఛను అందుతుంది.

దేశంలోని సన్న, చిన్న కారు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన (పీఎంకేఎంవై) పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, ఎల్‌ఐసీ బీమా సంస్థ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతుంది. ఈ పథకంలో చేరేందుకు రెండు హెక్టార్ల లోపు భూమి పత్రాలను ఆధారంగా చూపిస్తే సరిపోతుంది. 18-40 సంవత్సరాల వయసు ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి అమలు చేసే నోడల్‌ ఆధికారులు, సాధారణ రైతు సేవా కేంద్రాల్లో (సీఎస్‌సీ) రైతులు తమ ఆధార్‌ సంఖ్య, బ్యాంక్‌ ఖాతా సంఖ్య, మొబైల్‌ నంబరు వివరాలు నమోదు చేయించుకొని ప్రీమియం చెల్లిస్తే చాలు పథకంలో చేరినట్లవుతుంది. తరువాత పింఛను ఖాతా సంఖ్య తదితర వివరాలతో కూడిన కార్డును రైతుకు వెంటనే అందిస్తారు.

వయసును బట్టి ప్రీమియం ఇలా

* 18-25 సంవత్సరాల వయసు ఉన్న రైతులు కనిష్టంగా రూ. 55 గరిష్టంగా రూ. 95

* 40 సంవత్సరాల వయసులోపు ఉన్న రైతులు కనిష్టంగా రూ. 100 గరిష్టంగా రూ. 200 ప్రీమియం చెల్లించాలి. ఇలా చెల్లించిన సొమ్ముకు సమానంగా అంతే సొమ్మును కేంద్ర ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఇలా ప్రీమియం చెల్లించిన రైతులకు 60 సంవత్సరాలు నిండిన తరువాత నెలకు రూ.3000 వరకు పింఛను రూపంలో అందుతుంది. ప్రీమియం చెల్లించే గడువును ఎంచుకొనే అవకాశం ఉంది.

పథకం నుంచి ఎప్పుడైనా వైదొలగవచ్చు

ప్రీమియం చెల్లిస్తున్న రైతులు ఎప్పుడైనా పథకం నుంచి వైదొలగవచ్ఛు ఇలా వైదొలగుతున్న వారికి అప్పటి వరకు వారు చెల్లించిన ప్రీమియంతో పాటు వడ్డీని కలిపి తిరిగి చెల్లిస్తారు.

రైతు భార్యకు అర్హత : అనుకోని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లిస్తున్న రైతు మృతి చెందితే పథకం కొనసాగింపునకు భార్య అర్హురాలవుతుంది. 60 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత రైతు మరణిస్తే రైతు భార్యకు మొత్తం పింఛనులో 50శాతం ప్రతినెలా అందుతుంది


రైతులకు ఎంతో ఉపయోగం

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలోని సన్నచిన్నకారు రైతులంతా ఈ పథకంలో చేరి ప్రీమియం చెల్లిస్తే పింఛను పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఆసరాగా ఉంటుంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రైతుసేవా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి.

- సుబ్బారావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు, ఏలూరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రైతులకు పింఛను పథకం"

Post a Comment