APSET: రేపటి నుంచి ఏపీసెట్ దరఖాస్తులు ప్రారంభం... అక్టోబర్ 20న పరీక్ష

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-APSET రాయడానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఏపీసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 5న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 12 చివరి తేదీ. ఆ తర్వాత ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయొచ్చు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ నిర్వహిస్తోంది. మాస్టర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవాళ్లు ఏపీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు. పరీక్షను అక్టోబర్ 20న నిర్వహించబోతోంది ఆంధ్ర యూనివర్సిటీ. ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మొదటి సెషన్, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో సెషన్ ఉంటుంది

ఏపీసెట్‌లో 30 సబ్జెక్ట్స్‌ ఉంటాయి. కొత్తగా విజువల్ ఆర్ట్స్ కోర్సును చేర్చారు. అభ్యర్థులందరికీ పేపర్ 1 ఒకేలా ఉంటుంది. పేపర్ 2 సబ్జెక్ట్స్ వారీగా ఉంటాయి




ఏపీసెట్ నోటిఫికేషన్- 2019 జూలై 28
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 5
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 11
రూ.1,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 19
రూ.2,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 26
రూ.5,000 ఆలస్య రుసుము + రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3 (ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం మాత్రమే)
ఏపీ సెట్ పరీక్ష- 2019 అక్టోబర్ 20



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "APSET: రేపటి నుంచి ఏపీసెట్ దరఖాస్తులు ప్రారంభం... అక్టోబర్ 20న పరీక్ష"

Post a Comment