చంద్రయాన్‌-2 నుంచి భూమి ఇలా.

దిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. భూస్థిర కక్ష్యలో ప్రయాణిస్తున్న చంద్రయాన్‌-2.. ఎల్‌14 కెమెరాతో భూమికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను తీసి ఇస్రోకు పంపింది. తొలిసారిగా చంద్రయాన్‌ తీసిన ఈ ఫొటోలను ఇస్రో పంచుకుంది



గత నెల 22న ప్రారంభమైన ఈ ప్రయోగం దిగ్విజయంగా సాగుతోంది



చంద్రయాన్‌ కక్ష్యను ఇప్పటికే ఓ సారి పొడిగించారు. శుక్రవారం మధ్యాహ్యం మరోసారి పెంచారు. ఇందుకోసం చంద్రయాన్‌-2 ఇంజిన్లను 10 నిమిషాల పాటు మండించారు. 



ప్రస్తుతం ఉపగ్రహం నాలుగో భూ స్థిర కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. మరోసారి ఆగస్టు 6న కక్ష్య పెంపు ప్రక్రియను చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆగస్టు 20 కల్లా చంద్రయాన్‌-2 చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనుంది. అనంతరం చంద్రయాన్‌-2 నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయి చంద్రుడి ఉపరితలంపై దిగనుంది




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చంద్రయాన్‌-2 నుంచి భూమి ఇలా."

Post a Comment