మోటార్ వెహికిల్ చట్టానికి పార్లమెంట్ ఆమోదం.. తాగి నడిపితే రూ.10 వేలు ఫైన్
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.100 గా ఉన్న ఫైన్ను రూ.500 కు పెంచారు. ఇక పదేపదే ఉల్లంఘించేవారికి రూ.10వేలు వరకు జరిమానా విధించడం జరుగుతుంది. లైసైన్స్ దగ్గర లేకుండా వాహనాన్ని నడిపితే ఇప్పటివరకు రూ. 500 జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని రూ. 5000కు పెంచారు. సీటు బెల్టు ధరించకపోతే రూ. 1000 జరిమానా విధించడం జరుగుతుంది.
ఇప్పటి వరకు అది రూ. 100గా ఉండింది. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులకు జరిమానా రూ. 10వేలు విధిస్తారు. ఇప్పటి వరకు అది రూ. 2వేలుగా ఉంది. అతివేగంతో నడిపితే రూ. 5000 పెనాల్టీ విధిస్తారు. ఇక అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వాహనదారులకు రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రొవిజన్ బిల్లులో లేదు. దీన్ని కొత్తగా చేర్చారు. వాహనం యొక్క ఇన్ష్యూరెన్స్ ముగిసినప్పటికీ ఇంకా వాహనంను
నడుపుతుంటే రూ. 2వేలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇక నాణ్యమైన రోడ్లు వేయకుంటే కాంట్రాక్టర్లను దోషులుగా తేలుస్తామని కేంద్రం బిల్లులో పొందుపర్చింది. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో వ్యక్తి మృతి చెందితే పరిహారం కింద రూ. 25 వేలు ఇప్పటి వరకు ఉండేదని అయితే దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు బిల్లులో
పొందుపర్చారు. గాయపడ్డవారికి అందే పరిహారం రూ.12,500 ఉండగా దాన్ని రూ.50వేలుకు పెంచారు. ఇక యాక్సిడెంట్ ఫండ్ను కూడా కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో తెలిపారు
0 Response to "మోటార్ వెహికిల్ చట్టానికి పార్లమెంట్ ఆమోదం.. తాగి నడిపితే రూ.10 వేలు ఫైన్"
Post a Comment