ఆన్ లైన్ లో పరీక్షలు రాసేవిధానం వ్యాసం రాసిన వారు సివిప్రసాద్
ఆన్ లైన్ లో పరీక్షలు రాసేవిధానం వ్యాసం
రాసిన వారు సివిప్రసాద్
*🅰🅿డీఎస్సీ-2018 ఎస్జీటీ ఆన్ లైన్ పరీక్షలు*
👉🏽రేపటి నుంచి ప్రారంభమై ఈ నెలాఖరు వరకు ఈ పరీకలు జరుగుతాయి.
👉🏽పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.
*🧮అభ్యర్థులకు సూచనలు🧮*
👉🏽 అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి.
👉🏽అభ్యర్థి వెంట గుర్తింపు కార్డు(ఆధార్, ఓటరు కార్డు తదితర వాటిల్లో ఏదైనా) తప్పనిసరిగా తీసుకు వెళ్లాలి. లేని పక్షంలో పరీక్షకు అనుమతించరు.
👉🏽పరీక్ష ప్రారంభమైన తరవాత ఎవరినీ పరీక్ష హాల్ లోపలకు అనుమతించరు.
👉🏽2.30గంటలు పూర్తి కాగానే సబ్మిట్ బటన్ యాక్టివేట్ అవుతుంది.
👉🏽సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే ఆ విషయాన్ని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.
👉🏽విద్యార్థులకు హాల్ టికెట్పై ఉన్న పరీక్ష తేదీ, సమయం, రిజిస్టర్ నెంబరు, పరీక్ష కేంద్రం సరి చూసుకోవాలి.
👉🏽అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్ వర్డ్ను ఉపయోగించి లాగిన్ కావాలి.
👉🏽లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే వివరాలను సరిచూసుకుని ఐ కన్ఫర్మ్ అని గానీ, లేకపోతే ఐ డెనీ అని గానీ క్లిక్ చేయాలి.
👉🏽కేటాయించిన కంప్యూటర్ చక్కగా పనిచేస్తోందని, అన్ని నిబంధనలు చదివి అర్థం చేసుకున్నానని క్లిక్ చేయాలి.
👉🏽ఇచ్చిన నాలుగు జవాబులు నుంచి సరైన దానిని ఎంచుకుని మౌస్ ద్వారా క్లిక్ చేయాలి.
👉🏽పరీక్ష రాసినప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తుంది.
👉🏽 జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు రంగులోనూ, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు రంగులోను, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ రంగులోనూ, పునః పరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు ఉదా రంగులోను కనిపిస్తాయి.
👉🏽సరైన జవాబు ఇచ్చినట్లయితే ఒక మార్కు ఇస్తారు. జవాబు ఇవ్వని ప్రశ్నలకు 0 మార్కు ఇస్తారు.
👉🏽ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి సేవ్ అండ్ నెక్ట్స్ బటన్ నొక్కాలి.
👉🏽ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు సరైనది కాదు అని భావిస్తే క్లియర్ రెస్పాన్స్ బటన్ నొక్కాలి.
👉🏽కుడిపైన ఉండే సెక్షన్ బటన్ నొక్కడం ద్వారా జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునః పరిశీలనకు గుర్తించిన ప్రశ్నలను చూడవచ్చు.
👉🏽 చరవాణి (సెల్ఫోన్లు), పెన్డ్రైవ్, కాలిక్యులేటర్లు, హ్యాండ్ బ్యాగ్స్, గడియారాలుతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించ బడవు.
CVPRASAD
0 Response to "ఆన్ లైన్ లో పరీక్షలు రాసేవిధానం వ్యాసం రాసిన వారు సివిప్రసాద్"
Post a Comment