ASER 2018 is a nation-wide household survey that provides a snapshot of children’s schooling and learning for a representative


🛑💁🏻‍♂💁‍♀ *విద్యాప్రమాణాలులు నానాటికీ తగ్గిపోతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో చదువుతున్న పిల్లల విద్యాప్రమాణాల స్థాయిని లెక్కించడానికి ప్రతి రెండేళ్లకోసారి కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సర్వే నిర్వహిస్తూ వస్తోంది*. 


⬛ *ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ (రూరల్‌)-2018 చేదు నిజాలను బయటపెట్టింది.* 


⬛ *రెండోతరగతి పుస్తకాలు  చదవగలిగే అయిదో తరగతి విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% మేర ఉండగా 2018నాటికి ఆ సంఖ్య 44.2%కి పడిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోనూ ఉమ్మడిగా పఠనశక్తి తగ్గిపోతోంది*.


⬛ *2వ తరగతి పుస్తకాలు చదివే అయిదోతరగతి ప్రభుత్వపాఠశాలల విద్యార్థుల సంఖ్య 2008లో 53.1% ఉండగా 2018లో 44.2%కి తగ్గిపోయింది. ఇదే సమయంలో ప్రైవేటు విద్యార్థుల సంఖ్య 67.9% నుంచి 65.1%కి పడిపోయింది.* 


⬛ *ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్న తేడా లేకుండా పిల్లలందరిలో ఒకటే ధోరణి కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ పాఠశాలల్లో మౌలికవసతుల పరిస్థితి కొంత మెరుగుపడింది.*


⬛ *మరుగుదొడ్లు, తాగునీరు, కంప్యూటర్‌, విద్యుత్తు సౌకర్యం లాంటి వాటి కల్పనలో గతం కంటే పరిస్థితి మెరుగ్గా ఉంది. పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలు కూడా బాగానే ఉన్నట్లు తేలింది.*


🔷 *ఆంధ్రప్రదేశ్‌లో 6-14 మధ్య వయసు పిల్లల్లో 35.2% మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారు.* 


🔷 *11-14 మధ్య వయస్సు బాలికల్లో 2.9% మంది పాఠశాలలకు వెళ్లడం లేదు. 15-16 ఏళ్ల మధ్య బాలికల్లో 9.7% మంది పరిస్థితీ అదే విధంగా ఉంది*. 


🔷 *మూడో తరగతి చదువుతున్న పిల్లల్లో 22.4% మంది మాత్రమే రెండోతరగతి పుస్తకాలు చదవగలుగుతున్నారు.*


🔷 *ఇది జాతీయ సగటు 27.2% కంటే తక్కువ. మూడో తరగతి పిల్లల్లో 38.4% మంది తీసివేతలు చేయగలుగుతున్నారు. ఇది జాతీయ సగటు 28.1% కంటే ఎక్కువ.* 


🔷 *అయిదోతరగతి చదువుతున్న పిల్లల్లో 59.7% మంది రెండోతరగతి పుస్తకాలు చదవగలరు. 39.3 మంది భాగహారాలు చేయగలరు. 8వ తరగతి పిల్లల్లో 78.2% మందికి రెండో తరగతి పుస్తకాలు చదివేశక్తి ఉంది. 47.6% మంది భాగహారాలు చేయగలుగుతున్నారు*. 


🔷 *ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ పిల్లలు జాతీయ సగటు కంటే కొంత పై స్థాయిలోనే ఉన్నారు*. 


🔷 *విద్యార్థులు-అధ్యాపకుల నిష్పత్తి రాష్ట్రంలో 2010లో 60% ఉండగా 2018 నాటికి 61.5%కి పెరిగింది. తరగతి-టీచర్‌ నిష్పత్తి ఇదే సమయంలో 53.9 నుంచి 70%కి చేరింది.*


🔷 *ఆఫీసు/స్టోర్‌లాంటి సౌకర్యాలున్న పాఠశాలల నిష్పత్తి 57% నుంచి 58.6%కి చేరింది. క్రీడా మైదానాలున్న పాఠశాలల నిష్పత్తి 61.2% నుంచి 61.9%కి పెరిగింది.* 


🔷 *ప్రహరీలున్న పాఠశాలల సంఖ్య 47.2 నుంచి 55.1%కి చేరింది.* 


🔷 *మధ్యాహ్నభోజనం వండటానికి వంటశాలలున్న పాఠశాలల సంఖ్య 64.2% నుంచి 72.9%కి పెరిగింది.* 


🔷 *మరుగుదొడ్లున్న బడుల సంఖ్య 38.6% నుంచి 86.4%కి చేరింది. ఇందులో బాలికల మరుగుదొడ్లున్న పాఠశాలల సంఖ్య 25.4% నుంచి 81.1%కి పెరిగింది.* 


🔷 *60, ఆలోపు పిల్లలున్న పాఠశాలల సంఖ్య 2010-2018 మధ్యకాలంలో 31.5% నుంచి 38.6%కి చేరింది*. 


🔷 *గ్రంథాలయం, పుస్తకాలు అందుబాటులో ఉన్న స్కూళ్ల సంఖ్య 92% నుంచి 91%కి తగ్గింది. గ్రంథాలయం పుస్తకాలు ఉపయోగించుకుంటున్న పిల్లల సంఖ్య 2010లో 77.6% ఉండగా 2018నాటికి 54.8%కి తగ్గింది.* 


🔷 *కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య 2010లో 9.3% ఉండగా, 2018 నాటికి 22.6%కి చేరింది. సర్వేకి వెళ్లినరోజు కంప్యూటర్లు ఉపయోగిస్తూ కనిపించిన పిల్లల సంఖ్య 2014లో 5.6% ఉండగా 2018లో 6.6%మేర ఉంది.*


🔷 *సర్వేనాడు మధ్యాహ్నభోజనం సరఫరా చేస్తూ కనిపించిన పాఠశాలల సంఖ్య 2010లో 99.7% ఉండగా, 2018లో 96%కి పరిమితమైంది*. 


🔷 *6-14 మధ్య వయస్సున్న పిల్లల హాజరుశాతం ఆంధ్రప్రదేశ్‌లో 80-84% మధ్య ఉంది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌ రెండోదశ రాష్ట్రాల జాబితాలో నిలబడింది.* 


🔷 *11-14 మధ్య వయస్సులో బడికి వెళ్లని బాలికల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 2006లో 10.5% మంది ఉండగా, 2018 నాటికి అది 2.9%కి తగ్గింది*.


🔷 *15-16 ఏళ్ల మధ్య గల బాలికల్లో బడికి వెళ్లని వారి సంఖ్య 2006లో 21.3% ఉండగా 2018 నాటికి అది 9.7% తగ్గింది. ఈ రెండు అంశాల్లో జాతీయ సగటు కంటే ఏపీలో పరిస్థితి బాగుంది.* 


🔷 *కనీస తీసివేతలు చేయగలిగే 3వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఏపీలో 5%మేర తగ్గింది. 2016లో ఈ సంఖ్య 39.1%మేర ఉండగా, 2018 నాటికి 34.1%కి చేరింది*. 


🔷 *రెండోతరగతి స్థాయి పుస్తకాలు చదవగలిగే 3వ తరగతి విద్యార్థుల సంఖ్య 2008-2018 మధ్యకాలంలో ఏపీలో 71-80% ఉంది. ఇందులో ఏపీ దేశంలో మూడోస్థాయి రాష్ట్రాల సరసన నిలిచింది.*


About ASER 2018

ASER 2018 is a nation-wide household survey that provides a snapshot of children’s schooling and learning for a representative

sample of children across rural India. Children in the age group 3 to 16 are surveyed to find out their enrollment status in

school or pre-school. Children in the age group 5 to 16 are assessed one-on-one to understand their basic reading and

arithmetic abilities. ASER continues to be the only national source of information about children’s foundational skills

across the country.

The methodology and content of ASER 2018 continues the pattern followed each year for the first decade of our existence

(2005-2014), during which ASER reached almost all rural districts in India and generated district, state, and national

estimates of foundational reading and arithmetic abilities of children in the age group 5 to 16 years.

A national survey was not conducted in 2015. Starting its second decade of existence in 2016, ASER surveys now use

Census 2011 as the sampling frame. In addition, in 2016 ASER changed to an alternate-year cycle, conducting the ‘basic’

ASER in one year and using a different lens to examine new aspects of children’s learning the following year. Thus, ASER

2016 followed the ‘basic’ model, sampling children age 3 to 16 and testing reading, arithmetic, and English for children

age 5 to 16. In 2017 we conducted the first alternate-year design known as ASER ‘Beyond Basics’, focusing on youth in the

14 to 18 age group in 28 districts across India. ASER 2017 inquired about what youth are currently doing and aspiring to,

in addition to assessing their foundational skills and their ability to apply these to everyday tasks.

In 2018, ASER returns once again to the ‘basic’ model. 

CLICK HERE TO DOWNLOAD

CVPRASAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ASER 2018 is a nation-wide household survey that provides a snapshot of children’s schooling and learning for a representative"

Post a Comment